డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. తొలుత అక్కడే..

Medicines supply Through Drones in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. మారుమూల గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలు, వ్యాక్సిన్లు, బ్లడ్ యూనిట్లను చేరవేసేందుకు రెడ్ వింగ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ సేవలు అందిస్తారు. పాడేరు చుట్టుపక్కల ఉన్న పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు, బ్లడ్ యూనిట్లు సరఫరా చేస్తారు. ఈ విధానం ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో విజయవంతం కావటంతో ఏపీ ప్రభుత్వం కూడా దృష్టి సారించింది.

డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు పంపిణీ.. ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం.. తొలుత అక్కడే..
Medicines supply Through Drones in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. మారుమూల గిరిజన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాలు, వ్యాక్సిన్లు, బ్లడ్ యూనిట్లను చేరవేసేందుకు రెడ్ వింగ్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద అల్లూరి జిల్లా పాడేరు కేంద్రంగా డ్రోన్ సేవలు అందిస్తారు. పాడేరు చుట్టుపక్కల ఉన్న పీహెచ్‌సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు, బ్లడ్ యూనిట్లు సరఫరా చేస్తారు. ఈ విధానం ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో విజయవంతం కావటంతో ఏపీ ప్రభుత్వం కూడా దృష్టి సారించింది.