బాంబు పేలుడుకు తునాతునకలైన పాకిస్థాన్ పోలీసుల వాహనం.. ఏడుగురు మృతి, వీడియో వైరల్

సోమవారం రోజు పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ట్యాంక్ జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై టీటీపీ ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. అత్యంత శక్తివంతమైన రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీతో పోలీస్ సాయుధ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని పేల్చివేశారు. ఈ పేలుడు ధాటికి టన్నుల బరువుండే ఆ భారీ వాహనం కాగితం ముక్కలా గాల్లోకి ఎగిరి ముక్కలైపోయింది. మొత్తంగా ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

బాంబు పేలుడుకు తునాతునకలైన పాకిస్థాన్ పోలీసుల వాహనం.. ఏడుగురు మృతి, వీడియో వైరల్
సోమవారం రోజు పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తుంఖ్వాలోని ట్యాంక్ జిల్లాలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై టీటీపీ ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు. అత్యంత శక్తివంతమైన రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీతో పోలీస్ సాయుధ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని పేల్చివేశారు. ఈ పేలుడు ధాటికి టన్నుల బరువుండే ఆ భారీ వాహనం కాగితం ముక్కలా గాల్లోకి ఎగిరి ముక్కలైపోయింది. మొత్తంగా ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.