రైతులకు తీపి కబురు.. సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, మంత్రి కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రైతు డిక్లరేషన్ హామీల మేరకు వరంగల్‌లో ఈ నెల 5 నుంచి 7 వరకు రాయితీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మాట్లాడిన ఆయన.. రూ.21వేల కోట్ల రుణమాఫీ, సన్నబియ్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా పంపిణీ వంటి విజయాలను వివరించారు. రైతులను ఇబ్బంది పెట్టిన గత ప్రభుత్వానికి తమను విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.

రైతులకు తీపి కబురు.. సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు, మంత్రి కీలక ప్రకటన
తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. రైతు డిక్లరేషన్ హామీల మేరకు వరంగల్‌లో ఈ నెల 5 నుంచి 7 వరకు రాయితీపై వ్యవసాయ యంత్రాల పంపిణీ చేపట్టనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో మాట్లాడిన ఆయన.. రూ.21వేల కోట్ల రుణమాఫీ, సన్నబియ్యానికి రూ.500 బోనస్, రైతు భరోసా పంపిణీ వంటి విజయాలను వివరించారు. రైతులను ఇబ్బంది పెట్టిన గత ప్రభుత్వానికి తమను విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు.