విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాస్టళ్లు, గురుకులాలలో డైట్ ఛార్జీలు పెంపు..

ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త వినిపించింది. హాస్టళ్లు, గురుకులాలలో చదివే విద్యార్థులకు డైట్ ఛార్జీలను పదిశాతం పెంచాలని నిర్ణయించింది. మంత్రులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలలో మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు, అందుకే డైట్ ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. హాస్టళ్లు, గురుకులాలలో డైట్ ఛార్జీలు పెంపు..
ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త వినిపించింది. హాస్టళ్లు, గురుకులాలలో చదివే విద్యార్థులకు డైట్ ఛార్జీలను పదిశాతం పెంచాలని నిర్ణయించింది. మంత్రులతో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలలో మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందన్నారు చంద్రబాబు, అందుకే డైట్ ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు.