3 విడతల్లో భూముల రీసర్వే పూర్తి.. సాదాబైనామాపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

మార్చి-2027 నాటికి రాష్ట్రంలో 3 విడతల్లో భూముల రీసర్వే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూభారతి బలోపేతానికి, మేధావుల సూచనల మేరకు అధునాతన రోవర్లతో ఈ సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ల సమీక్షలో తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎకరాకు రూ.60 చెల్లిస్తామని, విధులకు రానివారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణలపై ప్రజల అపోహలను తొలగించి, నోటీసుల ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పనుల వేగవంతం, ఆగస్టు 15 లోగా విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

3 విడతల్లో భూముల రీసర్వే పూర్తి.. సాదాబైనామాపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
మార్చి-2027 నాటికి రాష్ట్రంలో 3 విడతల్లో భూముల రీసర్వే పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూభారతి బలోపేతానికి, మేధావుల సూచనల మేరకు అధునాతన రోవర్లతో ఈ సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ల సమీక్షలో తెలిపారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ఎకరాకు రూ.60 చెల్లిస్తామని, విధులకు రానివారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణలపై ప్రజల అపోహలను తొలగించి, నోటీసుల ద్వారా పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల పనుల వేగవంతం, ఆగస్టు 15 లోగా విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.