kumaram bheem asifabad-వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి

వైద్య సిబ్బంది, వైద్యులు సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, సూపర్‌వైజర్స్‌, పీహెచ్‌ఎన్‌, హెచ్‌వో, సీహెచ్‌వోలకు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాత శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులకు తప్పకుండా 12 వారాల లోపు రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించారు. వారికి ఏఎన్‌సీ క్లినిక్‌ రోజు ల్యాబ్‌లో జరిగే అన్ని పరీక్షలతో పాటు సికిల్‌ సెల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. సాధారణ ప్రసవాలు చేయాలని సూచించారు. నవజాత శిశువులకు ఇచ్చే జీరో డోస్‌ నుంచి బూస్టర్‌ మోతాదు ఇవ్వాలని చెప్పారు. 5,10, 16 ఏళ్ల వరకు టీడీ ఇవ్వాలని, ఎస్‌సీడీ గురించి, స్త్రీలకు వచ్చే క్యాన్సర్‌ నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని చెప్పారు

kumaram bheem asifabad-వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
వైద్య సిబ్బంది, వైద్యులు సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. జిల్లా ఆసుపత్రిలో వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, సూపర్‌వైజర్స్‌, పీహెచ్‌ఎన్‌, హెచ్‌వో, సీహెచ్‌వోలకు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాత శిశు సంరక్షణలో భాగంగా గర్భిణులకు తప్పకుండా 12 వారాల లోపు రిజిస్ట్రేషన్‌ చేయాలని సూచించారు. వారికి ఏఎన్‌సీ క్లినిక్‌ రోజు ల్యాబ్‌లో జరిగే అన్ని పరీక్షలతో పాటు సికిల్‌ సెల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. సాధారణ ప్రసవాలు చేయాలని సూచించారు. నవజాత శిశువులకు ఇచ్చే జీరో డోస్‌ నుంచి బూస్టర్‌ మోతాదు ఇవ్వాలని చెప్పారు. 5,10, 16 ఏళ్ల వరకు టీడీ ఇవ్వాలని, ఎస్‌సీడీ గురించి, స్త్రీలకు వచ్చే క్యాన్సర్‌ నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని చెప్పారు