ఆర్‌జీ కార్ బాధితురాలి ఇంటి సమీపంలో బాంబు దాడి.. ఐదుగురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ కక్షలు పరాకాష్ఠకు చేరాయి. ఆర్‌జీ కార్ బాధితురాలి తల్లి, ప్రస్తుత ఎమ్మెల్యే రత్న దేబ్నాథ్ నివాసానికి కూతవేటు దూరంలోనే బాంబులు వేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ బాంబు దాడిలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేపీ అగ్రనేత సువేందు అధికారి ప్రధాన అనుచరుడి హత్య జరిగిన కొద్ది గంటల్లోనే.. కార్యకర్తలే లక్ష్యంగా సాగిన ఈ బాంబు దాడి.. బెంగాల్‌లో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోంది.

ఆర్‌జీ కార్ బాధితురాలి ఇంటి సమీపంలో బాంబు దాడి.. ఐదుగురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు
పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ కక్షలు పరాకాష్ఠకు చేరాయి. ఆర్‌జీ కార్ బాధితురాలి తల్లి, ప్రస్తుత ఎమ్మెల్యే రత్న దేబ్నాథ్ నివాసానికి కూతవేటు దూరంలోనే బాంబులు వేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ బాంబు దాడిలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా.. ప్రస్తుతం వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీజేపీ అగ్రనేత సువేందు అధికారి ప్రధాన అనుచరుడి హత్య జరిగిన కొద్ది గంటల్లోనే.. కార్యకర్తలే లక్ష్యంగా సాగిన ఈ బాంబు దాడి.. బెంగాల్‌లో శాంతిభద్రతల దుస్థితికి అద్దం పడుతోంది.