ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి భారత్కు పుతిన్.. ప్రధాని మోదీతో భేటీ
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి భారత్కు పుతిన్.. ప్రధాని మోదీతో భేటీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5, 6 తేదీల్లో న్యూఢిల్లీలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ఖరారైంది. అయితే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న కారణంగా భారత్పై అమెరికా ఇటీవల భారీ సుంకాలను విధించిన నేపథ్యంలో ఈ పర్యటనకు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత లభించింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ద్వారా అటు వాషింగ్టన్తో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. దశాబ్దాల నాటి భారత్-రష్యా వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 5, 6 తేదీల్లో న్యూఢిల్లీలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఈ పర్యటన ఖరారైంది. అయితే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న కారణంగా భారత్పై అమెరికా ఇటీవల భారీ సుంకాలను విధించిన నేపథ్యంలో ఈ పర్యటనకు అత్యంత వ్యూహాత్మక ప్రాధాన్యత లభించింది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత పుతిన్ భారత్కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటన ద్వారా అటు వాషింగ్టన్తో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. దశాబ్దాల నాటి భారత్-రష్యా వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు.