ఎట్టకేలకు.. ఏళ్ల నాటి కల సాకారం.. ఆ స్టేషన్లో 3 రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం..

శంకర్ పల్లి రైల్వే స్టేషన్‌లో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలను(హాల్టింగ్) చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. రైల్వే మంత్రికి చేసిన విజ్ఞప్తి మేరకు పర్భని ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రెండు రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ కల్పించారు. ఇది స్థానిక ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు.. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైటెక్ సిటీ స్టేషన్‌లో కూడా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపాలని నిర్ణయించింది. ఐటీ కారిడార్ వాసులు సికింద్రాబాద్ వెళ్లే అవసరం లేకుండా నేరుగా ఇక్కడే రైలు ఎక్కవచ్చు.

ఎట్టకేలకు.. ఏళ్ల నాటి కల సాకారం.. ఆ స్టేషన్లో 3 రైళ్లకు హాల్టింగ్‌ సౌకర్యం..
శంకర్ పల్లి రైల్వే స్టేషన్‌లో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలను(హాల్టింగ్) చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. రైల్వే మంత్రికి చేసిన విజ్ఞప్తి మేరకు పర్భని ఎక్స్‌ప్రెస్‌తో పాటు మరో రెండు రైళ్లకు ఇక్కడ హాల్టింగ్ కల్పించారు. ఇది స్థానిక ఐటీ ఉద్యోగులు, విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు. మరోవైపు.. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే హైటెక్ సిటీ స్టేషన్‌లో కూడా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలపాలని నిర్ణయించింది. ఐటీ కారిడార్ వాసులు సికింద్రాబాద్ వెళ్లే అవసరం లేకుండా నేరుగా ఇక్కడే రైలు ఎక్కవచ్చు.