డీ-అడిక్షన్‌ సెంటర్‌లో చేర్చారన్న కోపంతో.. 29 స్పూన్లు, 19 బ్రష్‌లు మింగిన వ్యక్తి.. చివరకు

ఉత్తర్‌ప్రదేశ్‌ హపుర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. డీ-అడిక్షన్‌ సెంటర్‌లో చేర్చారన్న కోపంతో 40 ఏళ్ల సచిన్‌ అనే వ్యక్తి 29 స్టీల్‌ స్పూన్లు, 19 టూత్‌ బ్రష్‌లను మింగాడు. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతడిని ఆస్పత్రికి తరలించగా.. కడుపులో ఉన్న బ్రష్‌లు, స్పూన్లు ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు.బులంద్‌షహార్‌కు చెందిన సచిన్‌ మత్తు పదార్థాలకు బానిసగా మారడంతో.. ఇటీవల అతడి కుటుంబ సభ్యులు గజియాబాద్‌లోని సెంటర్‌లో చేర్చారు. అయితే, తనను రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చేర్చడంపై అసంతృప్తిగా ఉన్న సచిన్‌ ఆ కోపంతో అక్కడే బల్లపై ఉన్న స్పూన్లను, టూత్‌బ్రష్‌లను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి వాటిని విరిచి మింగాడు. అనంతరం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతడిని హపుర్‌లోని ఆస్పత్రికి తరలించి అల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే పరీక్షలు చేశారు. ఆ రిపోర్టులు వైద్యులను షాక్‌కు గురిచేశాయి. ఒకటి రెండు కాదు మొత్తం 29 స్పూన్లు, 19 టూత్‌ బ్రష్‌లు అతని కడుపులో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఎండోస్కోపీ చేసి వీటిని బయటకు తీయాలని భావించి సచిన్‌ను.. మీరట్‌కు తరలించారు. అయితే, ఎండోస్కోపీతో వీటిని తొలగించడం సాధ్యం కాదని అక్కడి వైద్యులు చెప్పడంతో తిరిగి హపుర్‌లోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వెంటనే శస్త్రచికిత్స చేసిన వైద్యులు సచిన్‌ కడుపులో నుంచి వాటిని బయటకి తీశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసు చూడడం తన కెరీర్‌లో ఇదే మొదటిసారని డాక్టర్​ శ్యామ్​ కుమార్​ తెలిపారు.

డీ-అడిక్షన్‌ సెంటర్‌లో చేర్చారన్న కోపంతో.. 29 స్పూన్లు, 19 బ్రష్‌లు మింగిన వ్యక్తి.. చివరకు
ఉత్తర్‌ప్రదేశ్‌ హపుర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. డీ-అడిక్షన్‌ సెంటర్‌లో చేర్చారన్న కోపంతో 40 ఏళ్ల సచిన్‌ అనే వ్యక్తి 29 స్టీల్‌ స్పూన్లు, 19 టూత్‌ బ్రష్‌లను మింగాడు. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురైన అతడిని ఆస్పత్రికి తరలించగా.. కడుపులో ఉన్న బ్రష్‌లు, స్పూన్లు ఆపరేషన్ చేసి తొలగించారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు.బులంద్‌షహార్‌కు చెందిన సచిన్‌ మత్తు పదార్థాలకు బానిసగా మారడంతో.. ఇటీవల అతడి కుటుంబ సభ్యులు గజియాబాద్‌లోని సెంటర్‌లో చేర్చారు. అయితే, తనను రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో చేర్చడంపై అసంతృప్తిగా ఉన్న సచిన్‌ ఆ కోపంతో అక్కడే బల్లపై ఉన్న స్పూన్లను, టూత్‌బ్రష్‌లను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి వాటిని విరిచి మింగాడు. అనంతరం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో అతడిని హపుర్‌లోని ఆస్పత్రికి తరలించి అల్ట్రాసౌండ్‌, ఎక్స్‌రే పరీక్షలు చేశారు. ఆ రిపోర్టులు వైద్యులను షాక్‌కు గురిచేశాయి. ఒకటి రెండు కాదు మొత్తం 29 స్పూన్లు, 19 టూత్‌ బ్రష్‌లు అతని కడుపులో ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఎండోస్కోపీ చేసి వీటిని బయటకు తీయాలని భావించి సచిన్‌ను.. మీరట్‌కు తరలించారు. అయితే, ఎండోస్కోపీతో వీటిని తొలగించడం సాధ్యం కాదని అక్కడి వైద్యులు చెప్పడంతో తిరిగి హపుర్‌లోని ఆసుపత్రికి తీసుకువచ్చారు. వెంటనే శస్త్రచికిత్స చేసిన వైద్యులు సచిన్‌ కడుపులో నుంచి వాటిని బయటకి తీశారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ఇలాంటి కేసు చూడడం తన కెరీర్‌లో ఇదే మొదటిసారని డాక్టర్​ శ్యామ్​ కుమార్​ తెలిపారు.