తమిళనాడు: బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. భారీగా ప్రాణనష్టం..

తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్‌నగర్‌ జిల్లాలోని కట్టనార్‌పట్టిలో ఉన్న బాణసంచా పరిశ్రమలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సమాచారం. భారీ పేలుడుతో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కంపించినట్లు తెలిసింది. దీంతో స్థానికులు భయపడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది .. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

తమిళనాడు: బాణాసంచా పరిశ్రమలో పేలుడు.. భారీగా ప్రాణనష్టం..
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. విరుద్‌నగర్‌ జిల్లాలోని కట్టనార్‌పట్టిలో ఉన్న బాణసంచా పరిశ్రమలో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 19 మంది చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ప్రమాదం ఉందని సమాచారం. భారీ పేలుడుతో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కంపించినట్లు తెలిసింది. దీంతో స్థానికులు భయపడిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది .. సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.