తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే లైన్.. 228 కి.మీ మేర, త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ ప్రతిపాదించిన కాచిగూడ - జగ్గయ్యపేట నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో కీలకమైన లైడార్ సర్వే పూర్తయింది. సుమారు 228 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, అంచనా వ్యయం వంటి వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను జూన్ నెలాఖరుకల్లా సిద్ధం చేసేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2023లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు.. ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన మార్గాన్ని ఖరారు చేస్తూ నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే లైన్.. 228 కి.మీ మేర, త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ ప్రతిపాదించిన కాచిగూడ - జగ్గయ్యపేట నూతన రైల్వే లైన్ ప్రాజెక్టులో కీలకమైన లైడార్ సర్వే పూర్తయింది. సుమారు 228 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, అంచనా వ్యయం వంటి వివరాలతో కూడిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను జూన్ నెలాఖరుకల్లా సిద్ధం చేసేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2023లో ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టు.. ఆధునిక సాంకేతికతతో కచ్చితమైన మార్గాన్ని ఖరారు చేస్తూ నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది.