పండుగ వేళ ప్రభుత్వోదోగ్యులకు సర్కారు గుడ్న్యూస్.. డీఏ పెంపుకు ఆమోదం, కోటి మందికి లబ్ధి
పండుగ వేళ ప్రభుత్వోదోగ్యులకు సర్కారు గుడ్న్యూస్.. డీఏ పెంపుకు ఆమోదం, కోటి మందికి లబ్ధి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దసరా, దీపావళి పండుగల ముందు డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) లను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ పెంపు జులై 1 నుంచే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. దీని వల్ల మొత్తంగా కోటి మందికి లాభం చేకూరనున్నట్లు కూడా వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. దసరా, దీపావళి పండుగల ముందు డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) లను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం మధ్యాహ్నం ప్రకటించారు. ఈ పెంపు జులై 1 నుంచే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. దీని వల్ల మొత్తంగా కోటి మందికి లాభం చేకూరనున్నట్లు కూడా వెల్లడించారు.