"ప్రజలు తిరస్కరించారు.. ప్రచారం కోసం కోర్టుకు వచ్చారా": జన్ సూరాజ్ పార్టీకి సీజేఐ సూటి ప్రశ్నలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సున్నా ఫలితంతో చుక్కెదురైన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరాజ్కు ఇప్పుడు సుప్రీం కోర్టులోనూ పరాభవం ఎదురైంది. ఎన్నికల నియమావళిని పాలక పక్షం ఉల్లంఘించిందని, ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసిందని పీకే పార్టీ చేసిన ఆరోపణలను కోర్టు తిరస్కరించింది. ఓటమి పాలైన పార్టీలు ప్రచారం కోసం కోర్టు మెట్లెక్కడం సరికాదని హితవు పలికిన ధర్మాసనం.. బీహార్ హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా ఇక్కడికి రావడంలో ఉన్న లాజిక్ ఏంటని ప్రశ్నించింది. ప్రచారం కోసమే వచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించి గట్టి షాక్ ఇచ్చింది.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సున్నా ఫలితంతో చుక్కెదురైన ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరాజ్కు ఇప్పుడు సుప్రీం కోర్టులోనూ పరాభవం ఎదురైంది. ఎన్నికల నియమావళిని పాలక పక్షం ఉల్లంఘించిందని, ఓట్లను డబ్బుతో కొనుగోలు చేసిందని పీకే పార్టీ చేసిన ఆరోపణలను కోర్టు తిరస్కరించింది. ఓటమి పాలైన పార్టీలు ప్రచారం కోసం కోర్టు మెట్లెక్కడం సరికాదని హితవు పలికిన ధర్మాసనం.. బీహార్ హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా ఇక్కడికి రావడంలో ఉన్న లాజిక్ ఏంటని ప్రశ్నించింది. ప్రచారం కోసమే వచ్చారా అంటూ సూటిగా ప్రశ్నించి గట్టి షాక్ ఇచ్చింది.