పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో అపచారం.. గాలిగోపురం ఎదుట అర్ధరాత్రి ఇదేం పని!

విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం సింహగిరిపై తీవ్ర అపచారం చోటుచేసుకుంది. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొండపై ఉన్న గాలిగోపురం ఎదుట నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించింది ఓ మహిళ. అర్ధరాత్రి వేళ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కలకలం రేపింది. సౌజన్య రాజకుమారి అనే యువతి జూన్ 29 అర్ధరాత్రి గాలిగోపురం వద్ద కేక్ కట్ చేసి బర్త్‌డే జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో అపచారం.. గాలిగోపురం ఎదుట అర్ధరాత్రి ఇదేం పని!
విశాఖపట్నంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం సింహగిరిపై తీవ్ర అపచారం చోటుచేసుకుంది. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి కొండపై ఉన్న గాలిగోపురం ఎదుట నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించింది ఓ మహిళ. అర్ధరాత్రి వేళ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం కలకలం రేపింది. సౌజన్య రాజకుమారి అనే యువతి జూన్ 29 అర్ధరాత్రి గాలిగోపురం వద్ద కేక్ కట్ చేసి బర్త్‌డే జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.