లక్షెట్టిపేట మున్సిపాలిటీలో తీవ్ర విషాదం.. ఫలితాల వేళ బీజేపీ అభ్యర్థి మృతి
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలో విషాదం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరుగుతున్న సమయంలోనే 10వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎల్లమ్మ అనారోగ్యంతో కన్నుమూశారు.