ఈ ఏడాదే ‘నీవా’కు నీటిని తీసుకొస్తాం

ఇప్పటికే హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకొచ్చాం. ఈ ఏడాది ‘నీవా’ వరకు నీటిని తీసుకొచ్చి పూతలపట్టు, చిత్తూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యాదమరిలో శనివారం జరిగిన ‘సంజీవని ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం మల్లన్న నుంచి తిరుమల వెంకన్న వరకు నీటిని తరలిస్తామన్నారు. ‘శ్రీశైలం నుంచి కల్యాణి డ్యాంకు నీటిని తీసుకొచ్చి ఆలయాలను అనుసంధానం చేస్తాం. గాలేరు నగరిని కోడూరు వరకు తీసుకొస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ను 2028 జూన్‌కు.. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లను అదే సంవత్సరం డిసెంబరుకు పూర్తి చేస్తాం. ప్రాజెక్టుల పూర్తికి అధికార అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఎక్కడిక్కడ నీటిని సమర్థంగా ఉపయోగించి భూగర్భ జలాలు పెంచారు. తద్వారా 8.5 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ప్రయోగం చేశాక రాష్ట్రమంతా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం సుందరమైన వాతావరణం ఉంది. తక్కువ ఎండ ఉండేది చిత్తూరు జిల్లానే. భూమినే జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

ఈ ఏడాదే   ‘నీవా’కు నీటిని తీసుకొస్తాం
ఇప్పటికే హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స ప్రాజెక్టు ద్వారా కుప్పం వరకు నీటిని తీసుకొచ్చాం. ఈ ఏడాది ‘నీవా’ వరకు నీటిని తీసుకొచ్చి పూతలపట్టు, చిత్తూరు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. యాదమరిలో శనివారం జరిగిన ‘సంజీవని ప్రజావేదిక’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం మల్లన్న నుంచి తిరుమల వెంకన్న వరకు నీటిని తరలిస్తామన్నారు. ‘శ్రీశైలం నుంచి కల్యాణి డ్యాంకు నీటిని తీసుకొచ్చి ఆలయాలను అనుసంధానం చేస్తాం. గాలేరు నగరిని కోడూరు వరకు తీసుకొస్తాం. సోమశిల స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ను 2028 జూన్‌కు.. మల్లెమడుగు, బాలాజీ రిజర్వాయర్లను అదే సంవత్సరం డిసెంబరుకు పూర్తి చేస్తాం. ప్రాజెక్టుల పూర్తికి అధికార అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఎక్కడిక్కడ నీటిని సమర్థంగా ఉపయోగించి భూగర్భ జలాలు పెంచారు. తద్వారా 8.5 మీటర్ల భూగర్భ జలాలు పెరిగాయి. ఈ ప్రయోగం చేశాక రాష్ట్రమంతా ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం సుందరమైన వాతావరణం ఉంది. తక్కువ ఎండ ఉండేది చిత్తూరు జిల్లానే. భూమినే జలాశయంగా చేసుకుంటే నీటి ఎద్దడి ఉండదు’ అని సీఎం చంద్రబాబు వివరించారు.