తెలంగాణలో ఆ ప్రభుత్వ ఉద్యోగాలు.. ఫేక్ సర్టిఫికెట్లతో మార్కులు..?

రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు చేపట్టిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీలో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం పెను దుమారం రేపుతోంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేటాయించిన 20 శాతం వెయిటేజీ మార్కులను కొందరు అనర్హులు అక్రమ మార్గంలో పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల రాత పరీక్షలో ప్రతిభ చూపిన అర్హులైన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి, నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో ఆ ప్రభుత్వ ఉద్యోగాలు.. ఫేక్ సర్టిఫికెట్లతో మార్కులు..?
రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు చేపట్టిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీలో ఫేక్ సర్టిఫికెట్ల వ్యవహారం పెను దుమారం రేపుతోంది. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేటాయించిన 20 శాతం వెయిటేజీ మార్కులను కొందరు అనర్హులు అక్రమ మార్గంలో పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల రాత పరీక్షలో ప్రతిభ చూపిన అర్హులైన అభ్యర్థులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులు లోతైన విచారణ జరిపి, నకిలీ పత్రాలు సమర్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.