అనకాపల్లి జిల్లా పోలీసులు వేర్వేరు ప్రదేశాల్లో 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని పట్టుకొన్నారు. కె.కోటపాడు పోలీసులు మండల కేంద్రానికి సమీపంలో కారులో తరలిస్తున్న వంద కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట పోలీసులు జాతీయ రహదారిపై పల్లావూరు కూడలి వద్ద 50 కిలోల గంజాయితో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరంతా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, అల్లూరి, అనకాపల్లి జిల్లాల మీదుగా గమ్యస్థానాలకు తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించారు.
అనకాపల్లి జిల్లా పోలీసులు వేర్వేరు ప్రదేశాల్లో 150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని తొమ్మిది మందిని పట్టుకొన్నారు. కె.కోటపాడు పోలీసులు మండల కేంద్రానికి సమీపంలో కారులో తరలిస్తున్న వంద కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేట పోలీసులు జాతీయ రహదారిపై పల్లావూరు కూడలి వద్ద 50 కిలోల గంజాయితో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరంతా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి, అల్లూరి, అనకాపల్లి జిల్లాల మీదుగా గమ్యస్థానాలకు తరలిస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడించారు.