TG: ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. భారీగా డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ..

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 17.651 శాతం కరువు భత్యం (DA) పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం జూలై 1, 2025 నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల టీజీ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు , పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యుత్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ధరల సూచీని బట్టి చేసే సమీక్షలో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

TG: ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్.. భారీగా డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ..
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. 17.651 శాతం కరువు భత్యం (DA) పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం జూలై 1, 2025 నుంచి అమలులోకి రానుంది. దీనివల్ల టీజీ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు , పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యుత్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతి ఏటా జనవరి, జూలై నెలల్లో ధరల సూచీని బట్టి చేసే సమీక్షలో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.