Yanam: యానాం గోదావరిలో కానాగంత చేపలకు ఏమైంది.. ఎందుకు ఇలా..
Yanam: యానాం గోదావరిలో కానాగంత చేపలకు ఏమైంది.. ఎందుకు ఇలా..
యానాం గౌతమి గోదావరిలో భారీ సంఖ్యలో కానాగంత చేప పిల్లలు మృతిచెంది ఒడ్డుకు కొట్టుకురావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో గోదావరిలో లవణీయత ఒక్కసారిగా తగ్గి, ఉప్పునీటిలో జీవించే కానాగంత చేపలు మృతిచెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు కారణాలపై స్పష్టత కోసం నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని స్థానికులు, మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.
యానాం గౌతమి గోదావరిలో భారీ సంఖ్యలో కానాగంత చేప పిల్లలు మృతిచెంది ఒడ్డుకు కొట్టుకురావడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి భారీగా వరద నీరు విడుదల కావడంతో గోదావరిలో లవణీయత ఒక్కసారిగా తగ్గి, ఉప్పునీటిలో జీవించే కానాగంత చేపలు మృతిచెందినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు కారణాలపై స్పష్టత కోసం నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని స్థానికులు, మత్స్యకారులు అధికారులను కోరుతున్నారు.