ఇరాన్‌లో భారీ పేలుడు... 14 మంది ఐఆర్‌జీసీ సిబ్బంది మృతి

పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్‌పై అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ దేశాల సంయుక్తంగా యుద్ధం చేయడంతో పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మరో 14 మంది మృతి చెందారు. దేశ వాయవ్య ప్రాంతంలోని జాంజన్ ప్రావిన్స్‌లో సంభవించిన ఓ పేలుడులో పద్నాలుగు మంది దుర్మరణం చెందారు.ఈ 14 మంది కూడా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సభ్యులుగా తెలుస్తోంది. మరో ఇద్దరు గాయపడ్డారు. యుద్ధం ముగిసినప్పటికీ భూమిలో నిక్షిప్తమై ఉన్న పాత బాంబులను ఐఆర్‌జీసీ దళాలు నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది., News News, Times Now Telugu

ఇరాన్‌లో భారీ పేలుడు... 14 మంది ఐఆర్‌జీసీ సిబ్బంది మృతి
పశ్చిమాసియాలో ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరాన్‌పై అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ దేశాల సంయుక్తంగా యుద్ధం చేయడంతో పలువురు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరాన్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో మరో 14 మంది మృతి చెందారు. దేశ వాయవ్య ప్రాంతంలోని జాంజన్ ప్రావిన్స్‌లో సంభవించిన ఓ పేలుడులో పద్నాలుగు మంది దుర్మరణం చెందారు.ఈ 14 మంది కూడా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సభ్యులుగా తెలుస్తోంది. మరో ఇద్దరు గాయపడ్డారు. యుద్ధం ముగిసినప్పటికీ భూమిలో నిక్షిప్తమై ఉన్న పాత బాంబులను ఐఆర్‌జీసీ దళాలు నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలడంతో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది., News News, Times Now Telugu