ఎగురుతుండగానే ఉన్నట్టుండి నేలరాలి చనిపోతున్న కాకులు.. ఆందోళనలలో జనం

చెన్నై మహానగరంలో కాకులు ఎగురుతుండగా అకస్మాత్తుగా నేలరాలి చనిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అడయార్‌తో సహా పలు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విషాహారం, కలుషిత నీరు, విద్యుత్ షాక్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పరీక్షల నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు. కాకులను తాకవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కారణాలను తెలుసుకోడానికి ల్యాబ్ పరీక్షల కోసం వాటి నమూనాలను తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీకి పంపినట్టు అధికారులు తెలిపారు.

ఎగురుతుండగానే ఉన్నట్టుండి నేలరాలి చనిపోతున్న కాకులు.. ఆందోళనలలో జనం
చెన్నై మహానగరంలో కాకులు ఎగురుతుండగా అకస్మాత్తుగా నేలరాలి చనిపోతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అడయార్‌తో సహా పలు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విషాహారం, కలుషిత నీరు, విద్యుత్ షాక్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పరీక్షల నివేదికల కోసం ఎదురుచూస్తున్నారు. కాకులను తాకవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కారణాలను తెలుసుకోడానికి ల్యాబ్ పరీక్షల కోసం వాటి నమూనాలను తమిళనాడు వెటర్నరీ యూనివర్సిటీకి పంపినట్టు అధికారులు తెలిపారు.