ఓవైపు చిన్నారుల ఆకలి కేకలు.. నర్మద నదికి 11,000 లీటర్ల పాలతో అభిషేకం

ఓ ఆలయంలో ఛైత్ర నవరాత్రులను నిర్వహించిన అనంతరం.. వేలాది లీటర్ల పాలను నదిలోకి శుద్ధి పేరుతో వదిలిపెట్టిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరతీసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు.. జల చరాలు, ప్రజలకు కూడా ప్రమాదమని అంటున్నారు. అంతేకాదు, రాష్ట్రంలోని చిన్నారులు తీవ్ర పోషకాహార సమస్యను ఎదుర్కొంటుంటే.. ఈ చర్యలు ఏ మాత్రం సమర్దనీయం కాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓవైపు చిన్నారుల ఆకలి కేకలు.. నర్మద నదికి 11,000 లీటర్ల పాలతో అభిషేకం
ఓ ఆలయంలో ఛైత్ర నవరాత్రులను నిర్వహించిన అనంతరం.. వేలాది లీటర్ల పాలను నదిలోకి శుద్ధి పేరుతో వదిలిపెట్టిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరతీసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై పర్యావరణవేత్తలు మండిపడుతున్నారు. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు.. జల చరాలు, ప్రజలకు కూడా ప్రమాదమని అంటున్నారు. అంతేకాదు, రాష్ట్రంలోని చిన్నారులు తీవ్ర పోషకాహార సమస్యను ఎదుర్కొంటుంటే.. ఈ చర్యలు ఏ మాత్రం సమర్దనీయం కాదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.