ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ

పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన విద్యార్థి నాయకుడు మరణంతో అతడి మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను దారుణంగా హత్య చేశారు. దీన్ని నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మైనార్టీలపై దాడులు, ఆలయాల విధ్వంసం నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి.

ఢిల్లీలో బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ
పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో మరోసారి హింస చెలరేగింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన విద్యార్థి నాయకుడు మరణంతో అతడి మద్దతుదారులు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను దారుణంగా హత్య చేశారు. దీన్ని నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మైనార్టీలపై దాడులు, ఆలయాల విధ్వంసం నేపథ్యంలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి.