సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..

ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల సమయంలో సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి.. వెంకట్రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులను జారీ అయ్యాయి. మరోవైపు కె. వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించటమే కాకుండా, పదవీ విరమణ ప్రయోజనాలను కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్.. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం..
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల సమయంలో సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి.. వెంకట్రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులను జారీ అయ్యాయి. మరోవైపు కె. వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగించటమే కాకుండా, పదవీ విరమణ ప్రయోజనాలను కూడా నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.