అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ నేతలకు గ్రీన్‌సిగ్నల్.. ఇక తగ్గేదేలే అంటూ..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. పార్టీ శ్రేణులతో.. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం. నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సభ వేదికగా ఎండగట్టాలని ఆయన నిర్ణయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్.. పార్టీ నేతలకు గ్రీన్‌సిగ్నల్.. ఇక తగ్గేదేలే అంటూ..
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీ సీనియర్ నేతల సమావేశంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. పార్టీ శ్రేణులతో.. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని చెప్పినట్లు సమాచారం. నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని సభ వేదికగా ఎండగట్టాలని ఆయన నిర్ణయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.