ఎంత ఘోరం?.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న బస్సు, 16 మంది మృతి

ప్రశాంతంగా సాగిపోతున్న ఆ ప్రయాణం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా శవాల కుప్పగా మారింది. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 16 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాజధాని జకర్తా నుంచి యోగ్యకర్తకు వెళ్తున్న ఒక అంతరాష్ట్ర బస్సు.. సెమరాంగ్ సిటీ వద్ద టోల్ రోడ్డుపై వేగంగా వెళ్తూ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కన ఉన్న కాంక్రీట్ బారియర్‌ను బలంగా ఢీకొట్టి భీకర శబ్దంతో బోల్తా పడింది. ఈ ప్రమాద ధాటికి 16 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ఎంత ఘోరం?.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న బస్సు, 16 మంది మృతి
ప్రశాంతంగా సాగిపోతున్న ఆ ప్రయాణం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా శవాల కుప్పగా మారింది. ఇండోనేషియాలోని జావా ద్వీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 16 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాజధాని జకర్తా నుంచి యోగ్యకర్తకు వెళ్తున్న ఒక అంతరాష్ట్ర బస్సు.. సెమరాంగ్ సిటీ వద్ద టోల్ రోడ్డుపై వేగంగా వెళ్తూ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. రోడ్డు పక్కన ఉన్న కాంక్రీట్ బారియర్‌ను బలంగా ఢీకొట్టి భీకర శబ్దంతో బోల్తా పడింది. ఈ ప్రమాద ధాటికి 16 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.