ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త: జీతాలు పెంచిన ప్రభుత్వం... ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు

104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అదనంగా జీతాలు అందిస్తుంది. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులకు రూ.5,000 చొప్పున, కొత్తగా చేరిన వారికి రూ.2,000 చొప్పున జీతం పెంచింది. గతంలో పైలట్‌కు రూ.18,000 జీతం ఉండగా ప్రస్తుతం రూ.5000 పెంచడంతో ఆ జీతం రూ.23,000కి పెరిగింది. ఈఎంటీకి రూ.20,000 ఉండగా అదికాస్తా ఇప్పుడు రూ.25,000కి పెరిగింది. ఈ నెల నుంచి పెంచిన జీతం సైతం ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి.ఇకపోతే కొందరు ఉద్యోగులకు రెండు నెలల జీతం, ఇంక్రిమెంట్లు, సెలవులు పెండింగ్ ఉన్నాయి. దాంతో ఒక్కొక్కరికి రూ.60,000 నుంచి రూ.90,000 వరకు బకాయి ఉంది.వీరితోపాటు జూనియర్ సిబ్బందికి అదనంగా రూ.4,000 చొప్పున, మరికొంతమంది ఉద్యోగులకు రూ.5,000 వరకు జీతాలు పెరిగినట్లు తెలుస్తోంది., News News, Times Now Telugu

ఏపీలో ఆ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త: జీతాలు పెంచిన ప్రభుత్వం... ఒక్కొక్కరికి నెలకు రూ.5వేలు
104, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అంబులెన్స్‌ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అదనంగా జీతాలు అందిస్తుంది. ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసిన ఉద్యోగులకు రూ.5,000 చొప్పున, కొత్తగా చేరిన వారికి రూ.2,000 చొప్పున జీతం పెంచింది. గతంలో పైలట్‌కు రూ.18,000 జీతం ఉండగా ప్రస్తుతం రూ.5000 పెంచడంతో ఆ జీతం రూ.23,000కి పెరిగింది. ఈఎంటీకి రూ.20,000 ఉండగా అదికాస్తా ఇప్పుడు రూ.25,000కి పెరిగింది. ఈ నెల నుంచి పెంచిన జీతం సైతం ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్లలో జమ అయ్యాయి.ఇకపోతే కొందరు ఉద్యోగులకు రెండు నెలల జీతం, ఇంక్రిమెంట్లు, సెలవులు పెండింగ్ ఉన్నాయి. దాంతో ఒక్కొక్కరికి రూ.60,000 నుంచి రూ.90,000 వరకు బకాయి ఉంది.వీరితోపాటు జూనియర్ సిబ్బందికి అదనంగా రూ.4,000 చొప్పున, మరికొంతమంది ఉద్యోగులకు రూ.5,000 వరకు జీతాలు పెరిగినట్లు తెలుస్తోంది., News News, Times Now Telugu