కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్.. ఆర్టీసీలో ఇక టికెట్ లేకుండా ప్రయాణం..

తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రతి మహిళకు ప్రత్యేక స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బకాయిలను భారీగా తగ్గించడంతో పాటు.. హైదరాబాద్‌లో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. వీటితో పాటు కుల వృత్తులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు సకాలంలో విద్యా వస్తువుల పంపిణీకి నిధులు విడుదల చేశామన్నారు.

కీలక నిర్ణయం తీసుకున్న రేవంత్ సర్కార్.. ఆర్టీసీలో ఇక టికెట్ లేకుండా ప్రయాణం..
తెలంగాణలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదయ్యాయని, ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు ప్రతి మహిళకు ప్రత్యేక స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బకాయిలను భారీగా తగ్గించడంతో పాటు.. హైదరాబాద్‌లో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. వీటితో పాటు కుల వృత్తులకు ఉచిత విద్యుత్, విద్యార్థులకు సకాలంలో విద్యా వస్తువుల పంపిణీకి నిధులు విడుదల చేశామన్నారు.