భారత పర్యటనకు తాలిబన్ మంత్రి.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం

తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. 2021లో తాలిబన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌కు వస్తున్న తొలి ఉన్నత స్థాయి నాయకుడు ఈయనే కాగా.. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ తాత్కాలిక ప్రయాణ మినహాయింపు ఇవ్వడంతో ఈ పర్యటన సాధ్యమైంది. ఈ పర్యటన భారత్-అఫ్గాన్ సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని, వాణిజ్యం, భద్రతపై చర్చలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రాంతీయంగా భారత్ ప్రభావాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.

భారత పర్యటనకు తాలిబన్ మంత్రి.. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం
తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. 2021లో తాలిబన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్‌కు వస్తున్న తొలి ఉన్నత స్థాయి నాయకుడు ఈయనే కాగా.. ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీ తాత్కాలిక ప్రయాణ మినహాయింపు ఇవ్వడంతో ఈ పర్యటన సాధ్యమైంది. ఈ పర్యటన భారత్-అఫ్గాన్ సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని, వాణిజ్యం, భద్రతపై చర్చలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రాంతీయంగా భారత్ ప్రభావాన్ని పెంచుతుందని భావిస్తున్నారు.