Andhra: ఏపీలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్..
Andhra: ఏపీలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్..
మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ వైద్య సరఫరా వ్యవస్థను ప్రారంభిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా 60–80 కిలోమీటర్ల పరిధిలోని గిరిజన ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయనుంది. కోల్డ్ చైన్ సదుపాయంతో కూడిన ఈ డ్రోన్లను రక్తం, ఇతర నమూనాల రవాణాకు కూడా వినియోగించనున్నారు.
మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ వైద్య సరఫరా వ్యవస్థను ప్రారంభిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా 60–80 కిలోమీటర్ల పరిధిలోని గిరిజన ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయనుంది. కోల్డ్ చైన్ సదుపాయంతో కూడిన ఈ డ్రోన్లను రక్తం, ఇతర నమూనాల రవాణాకు కూడా వినియోగించనున్నారు.