ఓటు వేసేందుకు సొంతూరు వెళ్తుండగా ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
ఓటు వేసేందుకు సొంతూరు వెళ్తుండగా ఘోరం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దశంకరంపేటలో బైక్పై వెళ్తున్న వారిని వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను లింగమయ్య, సాయవ్వ, సాయి, మానసగా గుర్తించారు.
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దశంకరంపేటలో బైక్పై వెళ్తున్న వారిని వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులను లింగమయ్య, సాయవ్వ, సాయి, మానసగా గుర్తించారు.