విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్ బాకాయిలు విడుదల చేస్తూ జీవో జారీ..

తెలంగాణలోని బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ఆర్థిక శాఖ మొత్తం రూ. 365.75 కోట్ల బకాయిలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ. 152.59 కోట్లు, మరియు బీసీ సంక్షేమ శాఖకు రూ. 21.62 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాం నుండి నిలిచిపోయిన బకాయిలన్నీ ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిధులు సర్దుబాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

విద్యార్థులకు శుభవార్త.. స్కాలర్‌షిప్ బాకాయిలు విడుదల చేస్తూ జీవో జారీ..
తెలంగాణలోని బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ఆర్థిక శాఖ మొత్తం రూ. 365.75 కోట్ల బకాయిలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎస్సీ సంక్షేమ శాఖకు రూ. 191.63 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖకు రూ. 152.59 కోట్లు, మరియు బీసీ సంక్షేమ శాఖకు రూ. 21.62 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాం నుండి నిలిచిపోయిన బకాయిలన్నీ ప్రస్తుత ప్రభుత్వం క్లియర్ చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిధులు సర్దుబాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.