మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్‌ సమావేశం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక ‌అప్‌డేట్..

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, తదుపరి లక్ష్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సమరశంఖం పూరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయి.. అన్ని జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు, ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.

మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్‌ సమావేశం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కీలక ‌అప్‌డేట్..
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, తదుపరి లక్ష్యంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సమరశంఖం పూరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయి.. అన్ని జిల్లా పరిషత్ పీఠాలను కైవసం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. జనవరి 2 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు, ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని కేడర్‌కు పిలుపునిచ్చారు.