విజయవంతమైన అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం.. తొలిసారి రైలు నుంచి పరీక్షించిన ఇండియా.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే

ఇండియా ఆయుధ సామర్థ్యాన్ని మరింత పెంచే అగ్ని ప్రైమ్ మధ్యంతర క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించారు. అయితే ఈ టెస్ట్‌ను రైలు నుంచి నిర్వహించడం గమనార్హం. భారత్ ఇలా రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. దీని గురించి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అణు వార్‌హెడ్లు కలిగిన అగ్ని ప్రైమ్‌ క్షిపణిని రైలు మీద నుంచి పరీక్షించినట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇది విజయవంతం కావడంతో డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)ను ఆయన ప్రశంసించారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన రైల్‌ బేస్డ్‌ మొబైల్‌ లాంఛర్‌ నుంచి తొలిసారి క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించారు. కేవలం రైల్‌ నెట్‌వర్క్‌ సాయంతోనే.. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే.. దీన్ని దేశంలో ఎక్కడికైనా తరలించి.. తక్కువ సమయంలోనే శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చని తెలిపారే.ఇది 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేరుకునేలా దీనిని రూపొందించారు.

విజయవంతమైన అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం.. తొలిసారి రైలు నుంచి పరీక్షించిన ఇండియా.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే
ఇండియా ఆయుధ సామర్థ్యాన్ని మరింత పెంచే అగ్ని ప్రైమ్ మధ్యంతర క్షిపణిని గురువారం విజయవంతంగా పరీక్షించారు. అయితే ఈ టెస్ట్‌ను రైలు నుంచి నిర్వహించడం గమనార్హం. భారత్ ఇలా రైలు నుంచి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. దీని గురించి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అణు వార్‌హెడ్లు కలిగిన అగ్ని ప్రైమ్‌ క్షిపణిని రైలు మీద నుంచి పరీక్షించినట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇది విజయవంతం కావడంతో డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)ను ఆయన ప్రశంసించారు. ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన రైల్‌ బేస్డ్‌ మొబైల్‌ లాంఛర్‌ నుంచి తొలిసారి క్షిపణిని ప్రయోగించినట్లు వెల్లడించారు. కేవలం రైల్‌ నెట్‌వర్క్‌ సాయంతోనే.. ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే.. దీన్ని దేశంలో ఎక్కడికైనా తరలించి.. తక్కువ సమయంలోనే శత్రువు కంటపడకుండా ప్రయోగించవచ్చని తెలిపారే.ఇది 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేరుకునేలా దీనిని రూపొందించారు.