Tirumala: లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు...సౌకర్యాలపై భక్తులతో ముఖాముఖి

తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు. అనంతరం లడ్డూ కౌంటర్‌లోని కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడంలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు., News News, Times Now Telugu

Tirumala: లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు...సౌకర్యాలపై భక్తులతో ముఖాముఖి
తిరుమలలోని శ్రీవారి లడ్డూల విక్రయ కేంద్రంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా భక్తులతో కలిసి స్వయంగా కౌంటర్ వద్దకు వెళ్లి లడ్డూల జారీ విధానాన్ని, సిబ్బంది పనితీరు, లడ్డూ బరువును తనిఖీ చేశారు. అనంతరం లడ్డూ కౌంటర్‌లోని కియోస్క్ యంత్రం వద్ద దర్శనం కాని భక్తులకు ఆధార్ నమోదు ద్వారా యూపీఐ చెల్లింపు చేసి లడ్డూలు పొందే విధానాన్ని పరిశీలించి భక్తుల నుండి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బూందీ పోటుకు వెళ్లి బూందీ తయారీని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించడంలో భాగంగా లడ్డూ విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేసినట్లు తెలిపారు., News News, Times Now Telugu