ఐదు బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ.. ఆ వివరాలివే..

తెలంగాణ శాసనసభ శుక్రవారం జరిగిన సమావేశాల్లో 5 కీలక సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు , జీహెచ్‌ఎంసీ రెండో సవరణ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర పాలనలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు, ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించడమే ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే యోచనలో భాగంగా ఈ సవరణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాలనా సౌలభ్యం కోసం వార్డుల పునర్విభజన, అధికారుల నియామకానికి ఈ బిల్లులు మార్గం సుగమం చేయనున్నాయి.

ఐదు బిల్లులకు ఆమోదం తెలిపిన తెలంగాణ అసెంబ్లీ.. ఆ వివరాలివే..
తెలంగాణ శాసనసభ శుక్రవారం జరిగిన సమావేశాల్లో 5 కీలక సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లు , జీహెచ్‌ఎంసీ రెండో సవరణ బిల్లులను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నగర పాలనలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు, ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించడమే ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించే యోచనలో భాగంగా ఈ సవరణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పాలనా సౌలభ్యం కోసం వార్డుల పునర్విభజన, అధికారుల నియామకానికి ఈ బిల్లులు మార్గం సుగమం చేయనున్నాయి.