Palamuru Rangareddy Project: పాలమూరు ప్రాజెక్ట్ యుద్ధం.. అవినీతి అంశంగా మారుతోందా?
Palamuru Rangareddy Project: పాలమూరు ప్రాజెక్ట్ యుద్ధం.. అవినీతి అంశంగా మారుతోందా?
తెలంగాణ రాజకీయాల్లో ఊహించనిదేదో జరగబోతోంది. అదేంటన్నది సీఎం రేవంత్ రెడ్డి చిన్న హింట్ ఇచ్చినా.. మరీ అంత దాకా వెళ్తుందా అనే అనుమానం అయితే ఉంది. 'కేసీఆర్, హరీష్రావు చేసిన పాపానికి ఉరి తీసినా తప్పులేదు' అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్పై నానా యాగీ జరుగుతోంది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడానికీ.. ఒకరకంగా ఈ కామెంట్ కూడా కారణమైంది. బట్.. అసలు విషయం 'ఉరి' అనే టాపిక్ కాదు. 'ఉరి తీసినా తప్పులేదు'.. అని అన్న తరువాత కొనసాగింపుగా ఇంకో మాట అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 'మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్లు.. భారత్ ప్రజాస్వామ్య దేశం కాబట్టి చట్ట ప్రకారం ముందుకెళ్తున్నాం' అన్నారు. ఈ 'చట్ట ప్రకారం ముందుకెళ్తున్నాం' అనే ఆ ఒక్క సెన్టెన్స్.. తెలంగాణ రాజకీయాల్లో ఊహించనిదేదో జరగబోతోంది అనే అనుమానాలకు కారణమైంది. అసలేంటీ ఆ మాటకు అర్థం? సింపుల్.. ఆల్రడీ కేసీఆర్పై కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ఎంక్వైరీ జరుగుతోంది. ఆ రెండిటిపై వేసిన కమిషన్ల ముందు కేసీఆర్ స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో మరోసారి కేసీఆర్ విచారణ ఎదుర్కోవచ్చు. ఆల్రడీ.. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్-TOR రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్గా మ్యాటర్ అయితే ఇదే. ఇంతకీ.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకని ఆ మాట అన్నారు? ఎక్కడ, ఏ తప్పు కనిపించినందుకు ఎంక్వైరీకి చేయిస్తాం అన్నారు?
తెలంగాణ రాజకీయాల్లో ఊహించనిదేదో జరగబోతోంది. అదేంటన్నది సీఎం రేవంత్ రెడ్డి చిన్న హింట్ ఇచ్చినా.. మరీ అంత దాకా వెళ్తుందా అనే అనుమానం అయితే ఉంది. 'కేసీఆర్, హరీష్రావు చేసిన పాపానికి ఉరి తీసినా తప్పులేదు' అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్పై నానా యాగీ జరుగుతోంది. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేయడానికీ.. ఒకరకంగా ఈ కామెంట్ కూడా కారణమైంది. బట్.. అసలు విషయం 'ఉరి' అనే టాపిక్ కాదు. 'ఉరి తీసినా తప్పులేదు'.. అని అన్న తరువాత కొనసాగింపుగా ఇంకో మాట అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 'మిడిల్ ఈస్ట్ దేశాల్లో అయితే రాళ్లతో కొట్టి చంపేవాళ్లు.. భారత్ ప్రజాస్వామ్య దేశం కాబట్టి చట్ట ప్రకారం ముందుకెళ్తున్నాం' అన్నారు. ఈ 'చట్ట ప్రకారం ముందుకెళ్తున్నాం' అనే ఆ ఒక్క సెన్టెన్స్.. తెలంగాణ రాజకీయాల్లో ఊహించనిదేదో జరగబోతోంది అనే అనుమానాలకు కారణమైంది. అసలేంటీ ఆ మాటకు అర్థం? సింపుల్.. ఆల్రడీ కేసీఆర్పై కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ఎంక్వైరీ జరుగుతోంది. ఆ రెండిటిపై వేసిన కమిషన్ల ముందు కేసీఆర్ స్వయంగా హాజరై వివరణ ఇచ్చారు. ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో మరోసారి కేసీఆర్ విచారణ ఎదుర్కోవచ్చు. ఆల్రడీ.. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్-TOR రెడీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఓవరాల్గా మ్యాటర్ అయితే ఇదే. ఇంతకీ.. సీఎం రేవంత్ రెడ్డి ఎందుకని ఆ మాట అన్నారు? ఎక్కడ, ఏ తప్పు కనిపించినందుకు ఎంక్వైరీకి చేయిస్తాం అన్నారు?