మున్సిపాలిటీ నీళ్లు తాగి ఎనిమిది మంది మృతి, వెయ్యి మందికి పైగా అస్వస్థత.. పైపు లీకేజీయే కారణమా?

దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరం అని గర్వంగా చెప్పుకునే ఇండోర్‌లో మానవ తప్పిదం ఎనిమిది మంది ప్రాణాలను బలితీసుకుంది. తాగునీటి పైప్‌లైన్‌లోకి మురుగునీరు చేరడంతో.. అది తాగిన పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు వందలాది మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. రోజుల తరబడి నీరు కలుషితమైందని మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో.. చివరకు భగీరథ్‌పురా ప్రాంతం శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉగ్రరూపం దాల్చారు. రాత్రికి రాత్రే ఉన్నతాధికారులపై వేటు వేశారు.

మున్సిపాలిటీ నీళ్లు తాగి ఎనిమిది మంది మృతి, వెయ్యి మందికి పైగా అస్వస్థత.. పైపు లీకేజీయే కారణమా?
దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరం అని గర్వంగా చెప్పుకునే ఇండోర్‌లో మానవ తప్పిదం ఎనిమిది మంది ప్రాణాలను బలితీసుకుంది. తాగునీటి పైప్‌లైన్‌లోకి మురుగునీరు చేరడంతో.. అది తాగిన పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు వందలాది మంది వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలయ్యారు. రోజుల తరబడి నీరు కలుషితమైందని మొత్తుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో.. చివరకు భగీరథ్‌పురా ప్రాంతం శ్మశాన వైరాగ్యాన్ని తలపిస్తోంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఉగ్రరూపం దాల్చారు. రాత్రికి రాత్రే ఉన్నతాధికారులపై వేటు వేశారు.