ఐరాసలో పాక్ ప్రధానిని కడిగిపారేసిన భారతీయ మహిళ.. అసలెవరీ పేటల్ గహ్లోత్?
ఐరాసలో పాక్ ప్రధానిని కడిగిపారేసిన భారతీయ మహిళ.. అసలెవరీ పేటల్ గహ్లోత్?
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగంపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ తన విదేశాంగ విధానంలో ఉగ్రవాదానికి పెద్ద పీట వేస్తుందని, షరీఫ్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, నాటకీయమైనవని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని కీర్తిస్తూ.. అదే సమయంలో ప్రపంచానికి బాధితురాలిగా కనిపించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుందని ఆమె ఘాటుగా విమర్శించారు. దశాబ్దాల పాటు ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్థాన్కు ఐరాస వేదికపై నిజాయితీగా మాట్లాడే హక్కు లేదని ఆమె స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రసంగంపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ తన విదేశాంగ విధానంలో ఉగ్రవాదానికి పెద్ద పీట వేస్తుందని, షరీఫ్ చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమైనవి, నాటకీయమైనవని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని కీర్తిస్తూ.. అదే సమయంలో ప్రపంచానికి బాధితురాలిగా కనిపించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుందని ఆమె ఘాటుగా విమర్శించారు. దశాబ్దాల పాటు ఉగ్రవాదానికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్థాన్కు ఐరాస వేదికపై నిజాయితీగా మాట్లాడే హక్కు లేదని ఆమె స్పష్టం చేశారు.