కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. రూ.12 వేల కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ

కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణకు రూ.12,015 కోట్లతో ఆమోదం తెలిపారు. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర 13 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400 కిలోమీటర్లకు చేరుకుంటుంది.

కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం.. రూ.12 వేల కోట్లతో ఢిల్లీ మెట్రో విస్తరణ
కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోన్న దేశ రాజధాని ఢిల్లీలో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఢిల్లీ మెట్రో ఐదో దశ విస్తరణకు రూ.12,015 కోట్లతో ఆమోదం తెలిపారు. ఈ దశలో 16 కిలోమీటర్ల మేర 13 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఢిల్లీ మెట్రో మొత్తం పొడవు 400 కిలోమీటర్లకు చేరుకుంటుంది.