తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే లైన్.. వేగవంతం కానున్న ట్రైన్ ప్రయాణం, నేడు ప్రారంభించనున్న ప్రధాని

దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ-కాజీపేట మార్గంలో రూ.1,952 కోట్ల వ్యయంతో చేపట్టిన 219 కి.మీ. మూడో లైను ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 194 కి.మీ. పనులు పూర్తి కాగా.. మిగిలిన 25 కి.మీ. పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అదనపు లైన్ అందుబాటులోకి రావడం వల్ల గ్రాండ్ ట్రంక్ రూట్‌లో రద్దీ తగ్గి తెలంగాణ-ఏపీ మధ్య సరకు, ప్రయాణికుల రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. దీనివల్ల దూరప్రాంత రైళ్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు పారిశ్రామిక రవాణా సులభతరం కానుంది.

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రైల్వే లైన్.. వేగవంతం కానున్న ట్రైన్ ప్రయాణం, నేడు ప్రారంభించనున్న ప్రధాని
దక్షిణ మధ్య రైల్వేలో అత్యంత రద్దీగా ఉండే విజయవాడ-కాజీపేట మార్గంలో రూ.1,952 కోట్ల వ్యయంతో చేపట్టిన 219 కి.మీ. మూడో లైను ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 194 కి.మీ. పనులు పూర్తి కాగా.. మిగిలిన 25 కి.మీ. పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ అదనపు లైన్ అందుబాటులోకి రావడం వల్ల గ్రాండ్ ట్రంక్ రూట్‌లో రద్దీ తగ్గి తెలంగాణ-ఏపీ మధ్య సరకు, ప్రయాణికుల రవాణా సామర్థ్యం గణనీయంగా పెరగనుంది. దీనివల్ల దూరప్రాంత రైళ్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు పారిశ్రామిక రవాణా సులభతరం కానుంది.