అరుణాచల్‌ ప్రదేశ్‌పై వీడియో చేసినందుకు.. భారతీయ వ్లాగర్‌పై చైనా ఫైర్, 15 గంటల పాటు నిర్బంధం

స్వేచ్ఛగా ప్రపంచాన్ని చుట్టేయాలనుకున్న ఒక భారతీయ యాత్రికుడికి చైనా గడ్డపై ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, అక్కడి ప్రజలకు అన్యాయం జరగకూడదని సోషల్ మీడియాలో గళమెత్తినందుకు.. భారతీయ వ్లాగర్ అనంత్ మిట్టల్‌ను చైనా అధికారులు వేధించారు. గ్వాంగ్‌జౌ విమానాశ్రయంలో దిగగానే అతన్ని ఒక నేరస్తుడిలా పక్కకు తీసుకెళ్లి, ఏకంగా 15 గంటల పాటు ఒక గదిలో బంధించి విచారించారు. కనీసం ఆహారం కూడా ఇవ్వకుండా.. భారత రాయబార కార్యాలయంతో మాట్లాడే అవకాశం కల్పించకుండా మానసిక చిత్రహింసలకు గురిచేశారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌పై వీడియో చేసినందుకు.. భారతీయ వ్లాగర్‌పై చైనా ఫైర్, 15 గంటల పాటు నిర్బంధం
స్వేచ్ఛగా ప్రపంచాన్ని చుట్టేయాలనుకున్న ఒక భారతీయ యాత్రికుడికి చైనా గడ్డపై ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, అక్కడి ప్రజలకు అన్యాయం జరగకూడదని సోషల్ మీడియాలో గళమెత్తినందుకు.. భారతీయ వ్లాగర్ అనంత్ మిట్టల్‌ను చైనా అధికారులు వేధించారు. గ్వాంగ్‌జౌ విమానాశ్రయంలో దిగగానే అతన్ని ఒక నేరస్తుడిలా పక్కకు తీసుకెళ్లి, ఏకంగా 15 గంటల పాటు ఒక గదిలో బంధించి విచారించారు. కనీసం ఆహారం కూడా ఇవ్వకుండా.. భారత రాయబార కార్యాలయంతో మాట్లాడే అవకాశం కల్పించకుండా మానసిక చిత్రహింసలకు గురిచేశారు.