ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ రైతులకు రూ.లక్షన్నర వరకూ రుణమాఫీ..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణం కోసం రెండో దశ భూసమీకరణ కింద భూములు ఇచ్చే ఏడు గ్రామాల రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఆయా గ్రామాలలోని రైతులకు రూ.1.50 లక్షల వరకూ రుణమాఫీ చేయాలని శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి ఆరో తేదీ 2026 లోపు తీసుకున్న రుణాలకు ఈ నిర్ణయం వర్తింపజేయనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఆ రైతులకు రూ.లక్షన్నర వరకూ రుణమాఫీ..
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణం కోసం రెండో దశ భూసమీకరణ కింద భూములు ఇచ్చే ఏడు గ్రామాల రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఆయా గ్రామాలలోని రైతులకు రూ.1.50 లక్షల వరకూ రుణమాఫీ చేయాలని శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జనవరి ఆరో తేదీ 2026 లోపు తీసుకున్న రుణాలకు ఈ నిర్ణయం వర్తింపజేయనున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.