చేనేతలకు ఉచిత కరెంట్.. తేదీపై క్లారిటీ వచ్చేసింది. మండలిలో మంత్రి కీలక ప్రకటన

ఏపీ ప్రభుత్వం చేనేతలకు శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఈ విషయంపై శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీలో చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మగ్గాలు ఉన్న అందరూ కూడా ఈ పథకానికి అర్హులేనని వెల్లడించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు.

చేనేతలకు ఉచిత కరెంట్.. తేదీపై క్లారిటీ వచ్చేసింది. మండలిలో మంత్రి కీలక ప్రకటన
ఏపీ ప్రభుత్వం చేనేతలకు శుభవార్త చెప్పింది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అనే దానిపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఈ విషయంపై శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఏపీలో చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. మగ్గాలు ఉన్న అందరూ కూడా ఈ పథకానికి అర్హులేనని వెల్లడించారు. చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు.