‘నా స్టాప్ వచ్చేసింది.. ఇక బై’.. వీసీ సజ్జనార్ భావోద్వేగ పోస్ట్ వైరల్..

దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా టీజీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేసిన వీసీ సజ్జనార్ ఐపీఎస్ బదిలీ సందర్భంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ఈ బస్సును పార్క్ చేసి, తదుపరి సవాలు వైపు వెళ్తున్నాను’ అని ఆయన భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆయన టీజీఎస్ఆర్టీసీకి ప్రాణాధారం అయిన డ్రైవర్లు, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్గో సేవలను విస్తరించడం, మహాలక్ష్మి పథకాన్ని సమర్థంగా అమలు చేయడం వంటి ఆయన సేవలు సంస్థకు నూతన ఊపునిచ్చాయి. ఆయనను కొత్తగా హైదరాబాద్ నగర సీపీగా నియమించారు.

‘నా స్టాప్ వచ్చేసింది.. ఇక బై’.. వీసీ సజ్జనార్ భావోద్వేగ పోస్ట్ వైరల్..
దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా టీజీఎస్ఆర్టీసీ ఎండీగా పనిచేసిన వీసీ సజ్జనార్ ఐపీఎస్ బదిలీ సందర్భంగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ఈ బస్సును పార్క్ చేసి, తదుపరి సవాలు వైపు వెళ్తున్నాను’ అని ఆయన భావోద్వేగ సందేశాన్ని పోస్ట్ చేశారు. ఆయన టీజీఎస్ఆర్టీసీకి ప్రాణాధారం అయిన డ్రైవర్లు, కండక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్గో సేవలను విస్తరించడం, మహాలక్ష్మి పథకాన్ని సమర్థంగా అమలు చేయడం వంటి ఆయన సేవలు సంస్థకు నూతన ఊపునిచ్చాయి. ఆయనను కొత్తగా హైదరాబాద్ నగర సీపీగా నియమించారు.