బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. కస్టడీలోనే మాజీ మంత్రి రమేష్ చంద్రసేన్ మృతి.. అసలేం జరిగిందంటే?

బంగ్లాదేశ్‌లో హిందూ నేతలపై హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా 86 ఏళ్ల వృద్ధుడు, మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ పోలీసుల కస్టడీలోనే తుది శ్వాస విడిచారు. గత 18 నెలల క్రితం ఆయనపై ఓ మూక దాడి చేయగా.. ఆయనకు సాయం చేయాల్సిన పోలీసులు ఆయన్నే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన్ను జైల్లోనే ఉంచుతూ.. ఆయనపై అనేక కేసులు పెడుతూ వస్తున్నారు. అయితే ఈమధ్య ఆయన ఆరోగ్యం క్షీణించగా.. బెయిల్ కావాలంటూ అనేక మార్లు కోర్టులో మొరపెట్టుకున్నా ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. కనీసం ఆయన్ను అధికారులు ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. ఈక్రమంలోనే శనివారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు.

బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. కస్టడీలోనే మాజీ మంత్రి రమేష్ చంద్రసేన్ మృతి.. అసలేం జరిగిందంటే?
బంగ్లాదేశ్‌లో హిందూ నేతలపై హింస ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా 86 ఏళ్ల వృద్ధుడు, మాజీ మంత్రి రమేష్ చంద్ర సేన్ పోలీసుల కస్టడీలోనే తుది శ్వాస విడిచారు. గత 18 నెలల క్రితం ఆయనపై ఓ మూక దాడి చేయగా.. ఆయనకు సాయం చేయాల్సిన పోలీసులు ఆయన్నే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన్ను జైల్లోనే ఉంచుతూ.. ఆయనపై అనేక కేసులు పెడుతూ వస్తున్నారు. అయితే ఈమధ్య ఆయన ఆరోగ్యం క్షీణించగా.. బెయిల్ కావాలంటూ అనేక మార్లు కోర్టులో మొరపెట్టుకున్నా ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. కనీసం ఆయన్ను అధికారులు ఆస్పత్రికి కూడా తీసుకెళ్లలేదు. ఈక్రమంలోనే శనివారం రాత్రి ఆయన ప్రాణాలు కోల్పోయారు.