సంక్రాంతికి ఊరెళ్లేవారికి శుభవార్త.. ప్రత్యేక రైళ్లు, రిజర్వేషన్‌తో పనిలేదు.. పూర్తి వివరాలివే..

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం 12 జన్‌సాధారణ్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విజయవాడ- విశాఖపట్నం మార్గంలో ఇవి సేవలు అందిస్తాయి. జనవరి 15వ తేదీ మినహా జనవరి 12 నుంచి జనవరి18వ తేదీ వరకూ ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం నుంచి ఉదయం పది గంటలకు బయల్దేరి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అలాగే విజయవాడ నుంచి సాయంత్రం ఆరున్నర గంటలకు బయల్దేరితే రాత్రి 12 గంటల 35 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది.

సంక్రాంతికి ఊరెళ్లేవారికి శుభవార్త.. ప్రత్యేక రైళ్లు, రిజర్వేషన్‌తో పనిలేదు.. పూర్తి వివరాలివే..
సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల కోసం 12 జన్‌సాధారణ్ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. విజయవాడ- విశాఖపట్నం మార్గంలో ఇవి సేవలు అందిస్తాయి. జనవరి 15వ తేదీ మినహా జనవరి 12 నుంచి జనవరి18వ తేదీ వరకూ ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం నుంచి ఉదయం పది గంటలకు బయల్దేరి సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుకుంటుంది. అలాగే విజయవాడ నుంచి సాయంత్రం ఆరున్నర గంటలకు బయల్దేరితే రాత్రి 12 గంటల 35 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది.