ఇప్పుడే కాదు...1908 లోనూ ‘మూసీ’ మహా ప్రళయం..! అప్పుడేం జరిగిందంటే..?
మూసీ వరదలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. సరిగ్గా 117 ఏళ్ల క్రితం కూడా మూసీ వరదలు బీభత్సం సృష్టించాయి. మళ్లీ ఇప్పుడు అంటే… సెప్టెంబర్ 26, 2025వ తేదీ అర్దరాత్రి నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది.
